యూపీలోని లక్నోలో షాకింగ్ ఘటన జరిగింది. సుల్తాన్గంజ్ ప్రాంతంలోని ఓ ఆలయంలోకి అర్ధరాత్రి దుండగులు ప్రవేశించారు. అనంతరం ఆలయంలోని శివలింగాన్ని పగులగొట్టారు. ఉదయాన్నే ఆలయానికి వచ్చిన భక్తులు ఆ శివలింగం విరిగి పడి ఉండడం చూశారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.