మూడో టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్‌ ఎంట్రీ

62చూసినవారు
మూడో టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్‌ ఎంట్రీ
కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్‌కు తొలిసారి భారత్ టెస్టు జట్టులో చోటు దక్కింది. రాజ్‌​కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్నమూడో టెస్టుకు కేఎల్‌ రాహుల్‌ స్ధానాన్ని పడిక్కల్‌తో సెలక్టర్లు భర్తీ చేశారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. రంజీలో కర్ణాటక తరపున పడిక్కల్ సెంచరీల మోతమోగించాడు. ఇంగ్లాండ్‌ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులోనూ శతకంతో దేవ్‌దత్‌(105) మెరిశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్