ఢిల్లీ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు అధ్యక్షుడిగా పనిచేసిన అరవిందర్ సింగ్ లవ్లీ కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవేందర్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు.