టెంపుల్‌లో విద్యుత్ తీగలు తగిలి భక్తుడు మృతి.. పలువురికి గాయాలు(వీడియో)

50చూసినవారు
ఢిల్లీలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ఓ భక్తుడు మృతి చెందాడు. అక్కడి కల్కాజీ టెంపుల్‌లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హాలోజన్ లైట్లు అమర్చేందుకు వినియోగించే విద్యుత్ వైరు తెగిపోయి, ఇనుప రెయిలింగ్‌కు తగిలింది. దీంతో పలువురికి విద్యుత్ షాక్ తగిలింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు తీవ్రగా గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్