AP: మహాశివరాత్రి పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే లింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అర్చకులు గోపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు శివ నామస్మరణతో పరవశించిపోతున్నారు. ఇవాళ ఉదయం ఇంద్రవాహనం-చప్పరం పై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.