BJP ఆఫీస్ వద్ద NSUI కార్యకర్తల ధర్నా

82చూసినవారు
BJP ఆఫీస్ వద్ద NSUI కార్యకర్తల ధర్నా
హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నీట్‌లో అక్రమాలు జరిగాయని BJP ఆఫీస్ ముందు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో వారికి BJP కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. బీజేపీ, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు పరస్పర వ్యతిరేక నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్