తెలుగు కుర్రాడు, భారత ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర సత్తాచాటాడు. తుర్కియేలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ స్టేజ్-3లో ధీరజ్ రెండు కాంస్య పతకాలు సాధించాడు. ఆదివారం రికర్వ్ వ్యక్తిగత విభాగంతోపాటు మిక్స్డ్ టీమ్ కేటగిరీలో మెడల్స్ గెలుచుకున్నాడు. రికర్వ్ వ్యక్తిగత కేటగిరీ బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో ధీరజ్ 7-3(28-27, 29-28, 27-28, 28-28, 30-29) తేడాతో మౌరో నెస్సోలి(ఇటలీ)పై విజయం సాధించాడు.