భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ గతిని మార్చి కోట్ల మందికి ఆదర్శంగా నిలిచాడు. ఆటగాడిగానే గాక గొప్ప మానవతావాదిగా పేరు పొందాడు. ఈ క్రమంలో ధోనిపై తాజాగా BAS (బీట్ ఆల్ స్పోర్ట్స్) ఓనర్ సోమి కోహ్లీ ఓ యూట్యూబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2019 వన్డే వరల్డ్ కప్లో బాస్ బ్యాట్ వాడిన ధోని.. తమ కంపెనీ స్టిక్కర్ను ఆయన బ్యాట్పై అంటించినందుకు ఒక్క పైసా కూడా తీసుకోలేదని తెలిపాడు.