టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి పాకిస్థాన్ నుంచి ఆహ్వానం వచ్చింది. 2006లో ధోనీ పాకిస్తాన్ వెళ్లాడు. అప్పుడు పాక్లో తిన్న భోజనం ఎంతో బాగుందని, పాకిస్తాన్ వెళ్లేవాళ్లు, తప్పకుండా భోజనం చేయమని తాజాగా ఒక వీడియోలో ధోనీ తెలిపాడు. అది కాస్తా నెట్టింట వైరల్ అయింది. దీనిపై పాకిస్తాన్ స్పోర్ట్స్ యాంకర్ ఫఖర్ ఆలం స్పందించాడు. మళ్లీ ఒకసారి భోజనం చేసేందుకు ధోనీని పాకిస్తాన్ రావల్సిందిగా ఎక్స్లో ఆహ్వనించాడు.