ఈ రోజుల్లో చాలామంది వయసుతో సంబంధం లేకుండా ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. ఈ క్రమంలో మనం తీసుకునే పదార్థాల్లో కొన్ని కలిపి తీసుకోకూడదంటున్నారు నిపుణులు. తద్వారా ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు తగ్గవచ్చని అంటున్నారు. అన్నం+బంగాళాదుంపలు, ఓట్స్+డ్రై ఫ్రూట్స్, స్నాక్స్+డ్రింక్స్ కలిపి తీసుకుంటే బరువు సమస్య పెరిగే అవకాశముందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.