దేశంలో గాజులా కనిపించే ఒక నది ఉంది. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోని ఉమ్గోట్ నదిని భారతదేశంలోని పరిశుభ్రమైన నదిగా పరిగణిస్తారు. దాని మీద ప్రయాణించే పడవలు గాలిలో తేలియాడుతున్నట్లుగా కనిపిస్తాయి. ఉమ్గౌట్ నదిని డౌకి అని కూడా అంటారు. డౌకి భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఒక చిన్న పట్టణం. ఇక్కడ నివసించే గిరిజన వర్గాల పూర్వీకుల నుంచి వస్తున్నసంప్రదాయాలే ఈ పరిశుభ్రతకు కారణమని చెబుతున్నారు. దీనిని వివిధ సంఘాలకు చెందిన పెద్దలు పర్యవేక్షిస్తున్నారు.