బుద్ధుని జీవితంలో వైశాఖ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యం ఉంది. బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ రోజే మూడు సార్లు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. బుద్ధుని కపిలవస్తు రాజు శుద్ధోధనుడు, మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధుడు సిద్ధార్ధుడిగా జన్మించారు. వైశాఖ పూర్ణిమ రోజే సిద్ధార్ధుడు జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారారు. ఇదే వైశాఖ పూర్ణిమనాడు బుద్దుడు నిర్యాణం చెందారు.