ఉగాది పండుగను దక్షిణ భారతదేశంలో నూతన సంవత్సరంగా చైత్ర మాసం మొదటి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 30న విశ్వావసు నామ సంవత్సరం ఆదివారం నాడు వచ్చింది. అయితే ఉగాది రోజున ఎరుపు, గోల్డ్, గోధుమ రంగు దుస్తులు ధరిస్తే శుభమని పండితులు చెబుతున్నారు. సూర్య ఆలయ దర్శనం, ఓం ఘృణిఃభృణిః సూర్య ఆదిత్యోం మంత్రం 12 సార్లు చదివి నీరు సమర్పిస్తే మంచిదంటున్నారు. రామ, నరసింహ, వెంకటేశ్వర ఆలయాల దర్శించుకున్నా మంచి జరుగుతుందని చెబుతున్నారు.