హిందూ మత విశ్వాసాల ప్రకారం అరటి చెట్టును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అరటి ఆకులలో శ్రీ మహా విష్ణువు, మహాలక్ష్మీ నివాసం ఉంటుందని నమ్ముతారు. అందుకే అరటి ఆకులలో నైవేద్యం సమర్పించడం వల్ల శ్రీహరిని ప్రసన్నం చేసుకోవచ్చని, స్వామి వారి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు. అలాగే అరటి చెట్టు ఆకుల నుంచి సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్ముతారు.