తమిళనాడులో దారుణం జరిగింది. చెన్నైలోని అన్నానగర్కు చెందిన డాక్టర్ బాలమురుగన్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆయన భార్య సుమతి (న్యాయవాది), ఇద్దరు కుమారులు ఉన్నారు. అల్ట్రాసౌండ్ కేంద్రాల ఏర్పాటుకు చేసిన అప్పులు, అలాగే వడ్డీ వ్యాపారుల ఒత్తిడి కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.