బాలికను వెంబడించి కరిచిన కుక్కలు (వీడియో)

542చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. సస్ని ప్రాంతంలో 5 ఏళ్ల బాలిక చాక్లెట్ కొనుక్కునేందుకు ఓ దుకాణం వద్దకు వచ్చింది. ఆ సమయంలో ఆ బాలికను 7 నుంచి 8 వీధికుక్కలు మొరిగాయి. భయంతో పరుగులు పెట్టిన బాలికను అవి వెంబడించాయి. అనంతరం కింద పడేసి దారుణంగా కరిచాయి. వీధికుక్కల దాడిలో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్