దోస్త్ కౌన్సెలింగ్.. జులై 4 వ‌ర‌కు అవ‌కాశం

77చూసినవారు
దోస్త్ కౌన్సెలింగ్.. జులై 4 వ‌ర‌కు అవ‌కాశం
తెలంగాణలోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలో డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం దోస్త్ కౌన్సెలింగ్ కొన‌సాగుతోంది. తాజాగా ఫేజ్-3 రిజిస్ట్రేష‌న్స్‌కు ఉన్న‌త విద్యామండ‌లి అవ‌కాశం క‌ల్పించింది. జులై 2వ తేదీ నుంచి 4వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు విద్యార్థులు రిజిస్ట్రేష‌న్స్ చేసుకోవ‌చ్చు. ఇక జులై 3 నుంచి 4 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లు ఎంచుకునేందుకు అవ‌కాశం ఉంది. కాగా, మొత్తం 1,066 డిగ్రీ కాలేజీలుండగా, వీటిల్లో 4,49,449 సీట్లున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్