ముందు అద్దం (విండ్ షీల్డ్)పై 'ఫాస్టాగ్'ను అమర్చని వాహనాల నుంచి రెట్టింపు టోల్ వసూలు చేయనున్నారు. ఈ మేరకు NHAI మార్గదర్శకాలు జారీ చేసింది. ఫాస్టాగ్ ను ఉద్దేశపూర్వకంగా విండ్ స్క్రీన్ పై అతికించకపోవడం వల్ల టోల్ ప్లాజాల వద్ద అనవసర జాప్యం ఏర్పడుతోందని NHAI వివరించింది. దీని ద్వారా తోటి వాహనదారులకు అసౌకర్యం కలుగుతోందని వెల్లడించింది.