ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖమేనీ, రైసీల ఆదేశాలతో ఇజ్రాయెల్పై ఇరాన్ బలగాలు గత నెలలో డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన సంగతి గమనార్హం. రైసీ మరణంతో ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్(69) ఆయన స్థానంలో తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారు.