హైదరాబాద్ లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్ లోని చింతలకుంట వద్ద వరద నీరు రోడ్డుపైకి చేరింది. దీంతో పార్కింగ్ చేసిన కార్లు నీటిలో మునిగిపోయాయి. విజయవాడ రహదారిపై వెళ్లాల్సిన వాహనాలకు అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.