ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్ జిల్లా ఖుతార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఓ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సును అతివేగంతో వస్తున్న డంపర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. బసులో ఉన్న ప్రయాణికులు యూపీలోని పూర్ణంగిరిలో మాత ఆస్థానానికి ప్రైవేట్ బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.