ఇరాన్లో ముందస్తు అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 28న ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలను జరగనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. దేశంలోని వాయువ్య ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రభుత్వంలోని మూడు శాఖల అధిపతులు దేశంలో ముందస్తు అధ్యక్ష ఎన్నికలకు తేదీని ప్రకటించారు. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బేర్ నియమితులయ్యారు.