ఏపీ పాలిసెట్ గడువు పెంపు

66చూసినవారు
ఏపీ పాలిసెట్ గడువు పెంపు
ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పెంచినట్లు పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా. చంద్రశేఖర్ వెల్లడించారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 27న ప్రవేశ పరీక్ష జరగనుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్