ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ MLA దుర్గేశ్ పాఠక్తో పాటు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ను నిన్న ఈడీ ప్రశ్నించింది. సౌత్ గ్రూప్ నుంచి హవాలా రూపంలో తీసుకున్న రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆప్ వాడిందని ఈడీ ఆరోపిస్తుండటం తెలిసిందే. MLA పాఠక్ను ఎన్నికల వేళ జరిగిన నగదు లావాదేవీలపై ఈడీ ప్రశ్నించింది. పాఠక్ను విచారించడంపై ఆప్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.