ఏకవ్యక్తి పాలనకు విముక్తి: శరద్ పవార్

80చూసినవారు
ఏకవ్యక్తి పాలనకు విముక్తి: శరద్ పవార్
‘గత పదేళ్లలో ప్రభుత్వం ఒక వ్యక్తి చేతుల్లో బంధీ అయింది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ నుంచి విముక్తి లభించింది’ అని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. ఇతర పార్టీల సహాయం లేకుండా కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నందున మోదీ హామీ ముగిసిందని తెలిపారు. ఓటర్ల బలంతోనే ఈ మార్పు సాధ్యమైందని చెప్పారు. నితీశ్, చంద్రబాబుల సహకారం లేకుండా ప్రభుత్వం ఏర్పాటయ్యేదే కాదన్నారు.

సంబంధిత పోస్ట్