దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 149.98 పాయింట్లు పెరిగి 76,606.57కు చేరుకుంది. నిఫ్టీ 58.10 పాయింట్ల లాభంతో 23,322.95 వద్ద ముగిసింది. కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, టెక్ మహీంద్రా షేర్లు రాణించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యునిలివర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ షేర్లు నష్టపోయాయి.