జమ్మూకశ్మీర్లోని దోడాలో వరుసగా నాల్గవరోజు ఎన్కౌంటర్ జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. కస్తిగఢ్ ప్రాంతంలోని జద్దన్బాటా గ్రామంలో తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి.