ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు నక్సలైట్లపై జరిపిన ఎన్కౌంటర్లో 29 మంది నక్సలైట్లు మరణించిన అంశంపై సీఎం విష్ణు దేవ్ స్పందించారు. ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసినందుకు DRG, BSF సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ఇది తమ ప్రభుత్వ అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. చారిత్రక ఎన్కౌంటర్లో పాల్గొన్న జవాన్లు, భద్రతా సిబ్బందిని తాను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.