టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు సాల్ట్, డకెట్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కొద్దిసేపటికే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఓపెనర్ సాల్ట్ (26), జడేజా బౌలింగ్లో డకెట్ (65) అవుట్ కావడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. ప్రస్తుతం క్రీజులో జోరూట్ (36*), బట్లర్ (2*) ఉండగా ఇంగ్లాండ్ స్కోరు 30 ఓవర్లకు 170/3గా ఉంది.