టీటీడీ పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈవో శ్యామలరావు చర్యలు చేపట్టారు. గత పాలకమండలి తీర్మానాలను అధికారిక వెబ్సైట్లో పెట్టించారు. 2023 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకు మొత్తం 8 బోర్డు సమావేశాలు జరిగాయి. అప్పుడు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచడంపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఆ తీర్మానాలు భక్తులకు తెలిసేలా టీటీడీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.