ఉత్తర్ప్రదేశ్లోని హత్రాస్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 23 మంది మృతిచెందారు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి పలువురు హాజరైన నేపథ్యంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. మృతుల్లో మొత్తం 19 మంది మహిళలు కూడా ఉన్నారు. ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.