యూపీలోని షామ్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బార్బర్ అమ్జాద్ తన సెలూన్కు వచ్చే కస్టమర్ల పట్ల వికృతంగా ప్రవర్తిస్తున్నాడు. కస్టమర్కు ఫేస్ మసాజ్, ఫేస్ ప్యాక్ చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఉమ్మి వేసి వారి ముఖాలకు అమ్జాద్ రాస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.