లోక్సభ సమరం ప్రారంభమైంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగియగా.. మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా రిజర్వేషన్ల అంశంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఫేక్ వీడియోలు అంతకంటే జోరుగా సర్క్యులేట్ అవుతుండటం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది.