ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో శనివారంఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్సోరీ-డెహ్రాడూన్ మార్గంలోని ఝరిపానీ రోడ్లో కారు అదుపు తప్పి లోతైన గుంటలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు మృతి చెందగా, నాన్సీ అనే బాలిక తీవ్రంగా గాయపడింది. ఆమె చికిత్స పొందుతోంది. నాన్సీ పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.