తెలుగు రాష్ట్రాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణలో 4 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరాయి. విజయవాడలో 44 డిగ్రీలు దాటాయి. ఉదయం ఎండవేడిమి, సాయంత్రం ఉక్కపోతతో జనం అల్లాడుతున్నాడు. ఎండ తీవ్రత భారీగా పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.