జమ్ముకశ్మీర్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉధంపూర్ జిల్లాలోని హైవేపై కారు ప్రమాదానికి గురైందని ఎస్ఎస్పీ జోగీంధర్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. ఓ మహిళకు గాయలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో జమ్ములోని ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఎస్పీ జోగీంధర్ సింగ్ తెలిపారు.