గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ‘కర్తవ్య్ పథ్’లో 2024 జనవరి 26న వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రదర్శించిన శకటాల్లో ఉత్తమమైన వాటికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డులను న్యాయ నిర్ణేతల ఎంపిక, ప్రజా ఎంపికలుగా రెండు విభాగాల్లో ప్రకటించారు. న్యాయ నిర్ణేతల విభాగంలో ఒడిశా మొదటి స్థానం కైవసం చేసుకుంది. ప్రజా ఎంపిక విభాగంలో గుజరాత్కు ప్రథమం స్థానం దక్కింది.