తమిళనాడు కాంచీపురం సమీపంలోని అయ్యంగార్కులం ప్రాంతంలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ బీఎండబ్ల్యూ కారు అతివేగంగా దూసుకెళ్లింది. స్కూటర్ను ఢీకొట్టి, చాలా దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కూటర్పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరొకరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారుడ్రైవర్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.