తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. విరుధ్నగర్- మధురై జాతీయ రహదారిపై తిరుమంగళం వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. బైకును వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు స్పాట్లోనే మృతిచెందారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.