ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ మంత్రి పదవికి, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి రాజ్ కుమార్ ఆనంద్ బుధవారం రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీలో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఢిల్లీలో సాంఘిక సంక్షేమ శాఖను నిర్వహించేవారు. ఇటీవల రాజ్కుమార్ ఆనంద్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. లోక్సభ ఎన్నికల వేళ మంత్రి రాజీనామా ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.