అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

27689చూసినవారు
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ని మండలం బడాపహాడ్‌కు 30 మందికి పైగా భక్తులతో వెళ్తున్న డీసీఎం బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. వీరంతా కమ్మర్‌పల్లి మండలానికి చెందిన వారిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్