ఉత్తరప్రదేశ్ లోని లక్నో-ప్రయాగ్రాజ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పగిలిపోవడంతో ట్రక్కు అదుపు తప్పి హైవేపై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ ట్రక్కులోనే ఇరుక్కుపోయారు. ట్రక్కు బోల్తా పడడంతో పాదచారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రక్కులో ఇరుక్కుపోయిన ఇద్దరిని బయటకి తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.