తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సేలం జిల్లా కృష్ణాపురంలో ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడిక్కడే మృతి చెందగా… తల్లి, మరో కూతురు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.