తండ్రికి వచ్చే పింఛన్ కోసం ఓ మహిళ చేసిన దారుణం విస్తుపోయేలా చేస్తోంది. తైవాన్కి చెందిన ఆమె తండ్రి సైన్యంలో 20 ఏళ్ల పాటు పనిచేశారు. ఆయనకు నెలకు దాదాపు రూ.1.27 లక్షల పెన్షన్ వస్తోంది. కొన్నేళ్లుగా పింఛను ఉపసంహరణ జరుగుతున్నప్పటికీ ఆ వృద్ధుడు మాత్రం కనిపించ లేదు. ప్రభుత్వ అధికారులు రెండు సార్లు ఇంటికొస్తే రానివ్వలేదు. పోలీసులు వచ్చి ఆరా తీయగా పొంతనలేని సమాధానం చెప్పింది. చివరకు ఆమె ఇంట్లో సోదాలు చేయగా విషయం బయటపడింది.