హైదరాబాద్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో బుధవారం అర్ధరాత్రి మియాపూర్ పరిధిలో ఇద్దరు మైనర్ల మధ్య ఘర్షణ తలెత్తింది. రూ.200 కోసం ఒకరిపై ఒకరు ఇద్దరు తలపడ్డారు. ఒకరు ముక్కుపై బలంగా కొట్టడంతో మరో మైనర్ కు తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు గమనించి ఆసుపత్రిలో చేర్చగా.. ఇవాళ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.