కర్ణాటక బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ అధికారిక సోషల్ మీడియా చేసిన ఒక పోస్టుపై బుధవారం FIR నమోదైంది. ‘కాంగ్రెస్ మేనిఫెస్టో లేక ముస్లిం లీగ్ మేనిఫెస్టోనా’ అనే టైటిల్తో చేసిన పోస్టుపై ఈ FIR ఫైల్ చేశారు. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. మల్లేశ్వరం అసెంబ్లీ స్థానం నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందం ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని చెప్పారు. మంగళవారం నాడు బీజేపీ సోషల్ మీడియా ఈ పోస్టు చేసింది.