'నీట్ యూజీ 2024' పేపర్ లీక్ కేసులో బీహార్ పోలీసులు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. గత రాత్రి జార్ఖండ్లోని ఎయిమ్స్-దేవ్గఢ్ సమీపంలోని ఓ ఇంటి నుంచి వారిని అదుపులోకి తీసుకున్నట్లు తాజాగా వెల్లడైంది. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 18కి చేరగా.. పేపర్ లీకేజీకి సూత్రధారి అమిత్ ఆనంద్ ఒక్కో విద్యార్థి నుంచి సుమారు రూ.30 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తేలిన సంగతి తెలిసిందే.