తమిళనాడులోని తెన్కాసి జిల్లాలో గల 'కుర్తాళం' జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగింది. జలపాతంలో టూరిస్టులు స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం పెరగడంతో ప్రజలంతా కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశారు. కాగా, తిరునల్వేలికి చెందిన అశ్విన్ అనే 16 ఏళ్ల బాలుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గల్లంతైన బాలుడి కోసం అగ్నిమాపక శాఖ, పోలీసులు గాలిస్తున్నారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రవాహం పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.