TG: నల్లగొండ జిల్లా నకిరేకల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల్లో ఎక్కువమంది అధికార పార్టీకి చెందిన స్థానిక నేతల అనుచరులేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ1 చిట్ల ఆకాశ్ ఓ ప్రజాప్రతినిధి వద్ద డ్రైవర్గా, ఏ3 బండి శ్రీను ఓ మాజీ సర్పంచ్కు డ్రైవర్గా ఉన్నట్టు తెలుస్తున్నది. ఏ4గా ఉన్న శేఖర్ ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేస్తూ అధికార పార్టీ నేతల వెంట తిరుగుతుంటారని సమాచారం.