కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా అజయ్ సేథ్ నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ఛైర్మన్గా తుహిన్కాంత్ పాండే నియమితులు కావడంతో ఆ పోస్టు ఖాళీ అయ్యింది. దీంతో ఆ స్థానంలో అజయ్ సేథ్ను నియమితులయ్యారు. అజయ్ సేథ్ 1987 బ్యాచ్ కర్ణాటక క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి.